ప్రధాని మోదీకి మాతృ వియోగం : PM Modi has lost his Mother

అమ్మను మించిన దైవమున్నదా... అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే... అన్నట్లుగా, దేశ ప్రధాని అయినా తల్లిని ఎల్లవేళలా గౌరవిస్తూ ఆమె కాళ్ళను కడుగుతూ ఆమె ఆశీర్వాదం తీసుకునేవారు.

ప్రధాని మోదీకి మాతృ వియోగం : PM Modi has lost his Mother

ప్రధాని మోదీకి మాతృ వియోగం : PM Modi has lost his Mother

 

అమ్మను మించిన దైవమున్నదా... అవతార పురుషుడైన అమ్మకు కొడుకే... అన్నట్లుగా, దేశ ప్రధాని అయినా తల్లిని ఎల్లవేళలా గౌరవిస్తూ ఆమె కాళ్ళను కడుగుతూ ఆమె ఆశీర్వాదం తీసుకునేవారు.

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ కు తరలించారు. రెండురోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో శివైక్యం చెందారు.

 

చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గురువారం అర్ధరాత్రి మరణించారు. ఆమె మృతి పట్ల దేశంలోని వివిధ పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం ప్రకటించారు. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాద్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు సంతాపం వ్యకం చేసిన వారిలో ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

 

కొడుకంటే ఆమెకు ఎంతో ప్రేమ...

ప్రధాని మోదీ తల్లి అయిన హీరాబెన్ కు కొడుకంటే ఎంతో ప్రేమ. ఆమె ఆయన్ని ఎప్పుడూ ముద్దాడేవారు. ఆయన పుట్టినరోజు నాడు ఆమె మోదీకి స్వీట్లు తినిపించేవారు. మోదీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తన పుట్టినరోజు నాడు మాత్రం తల్లి దగ్గరే ఉండేవారు. ఆమె కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకునేవారు. అప్పుడప్పుడు తన తల్లి డబ్బులు కూడా ఇచ్చేవారని పలు సందర్భాల్లో అయన గుర్తు చేసుకున్నారు. తాను ఇంతలా ఎదగడానికి ఆమె నేర్పించిన ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ శిక్షణ ఇంతటివాణ్ణి చేసిందని చెబుతుంటారు.

హీరాబెన్ భర్త క్యాన్సర్ తో 1989 లో మరణించారు. అప్పటి నుంచి ఆమె తన చిన్న కొడుకు వద్దనే ఉంటున్నారు. తన తల్లి విలువలకు కట్టుబడిన నిస్వార్థ కర్మయోగి జీవితం గడిపారని ప్రధాని కొనియాడారు. తమ చిన్నతనంలో మట్టిగోడలతో కట్టిన ఇంటిలో నివసించేవారమని ఆయన తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.

 

తల్లి పాడె మోసిన ప్రధాని

వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని తల్లి మరణవార్త విని హుటాహుటిన చేరుకున్నారు. తన తల్లి కాళ్ళ వద్ద కన్నీళ్లతో నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ తన తల్లి పాడెను మోశారు. గాంధీనగర్ లోని ముక్తిధామ్ స్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. తల్లి చితికి మోదీ నిప్పంటించారు. హీరాబెన్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తల్లిని కోల్పోయిన ప్రధానిని ఓదార్చారు.