వరల్డ్ టాప్‌ టెక్ సంస్థలకు సీఈవోలుగా మనోళ్లు : Indians as CEOs of world top tech companies

టాప్‌ టెక్ సంస్థలకు సీఈవోలుగా ఉన్న భారత సంతతికి చెందిన 10 మంది అత్యుతమ సీఈవోలను (Top 10 CEO's) మీకు పరిచయం చేస్తున్నాము.

వరల్డ్ టాప్‌ టెక్ సంస్థలకు సీఈవోలుగా మనోళ్లు : Indians as CEOs of world top tech companies

వరల్డ్ టాప్‌ టెక్ సంస్థలకు సీఈవోలుగా మనోళ్లు : Indians as CEOs of world top tech companies

ప్రపంచంలో ఉన్న చాలా ప్రతిష్టాత్మక దిగ్గజ కంపెనీలకు మన భారత సంతతికి చెందిన వ్యక్తులే అధిపతులుగా (Bosses) ఉన్నారు. చాలా రంగాలలోని ఆయా అగ్ర స్థాయి కంపెనీలకు మనోళ్లు సీఈవోలుగా ఉన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలను వీరు ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో భారత సంసతికి చెందిన సీఈవోలే ఎక్కువగా ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు మన భారతీయులే  నాయకత్వం వహిస్తున్నారు. వీరి నాయకత్వంలో వృద్ధిలోనూ ఆ కంపెనీలు దూసుకు వెళుతున్నాయి. ఇలా టాప్‌ టెక్ సంస్థలకు సీఈవోలుగా ఉన్న భారత సంతతికి చెందిన 10 మంది అత్యుతమ సీఈవోలను (Top 10 CEO's) మీకు పరిచయం చేస్తున్నాము.

 

సుందర్ పిచాయ్, ఆల్ఫాబెట్ (Sundar Pichai, Alphabet)

ప్రపంచ టెక్ కంపెనీల్లో టాప్‌ సంస్థ గూగుల్ (Google) మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) కు సుందర్ పిచాయ్ 2019 నుంచి సీఈవోగా ఉన్నారు. అంతకు ముందు 2014 నుంచే గూగుల్ హెడ్‌గా ఆయన పని చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సుందర్ పిచాయ్ బీటెక్ పూర్తి చేశారు.

 

సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ (Satya Nadella)

హైదరాబాద్‌లో పుట్టిన సత్య నాదెళ్ల.. ప్రస్తుతం దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్నారు. 2014 ఫిబ్రవరి నుంచి ఆ సంస్థను తన నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్నారు.

 

పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ (Parag Agarwal, Twitter)

పాపులర్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌కు సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఈ ఏడాదే నియమితులయ్యారు. ఐఐటీ బాంబేలో ఆయన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

 

శాంతనూ నారాయణ్, అడోబ్ (Shantanu Narayen, Adobe)

ప్రముఖ టెక్ కంపెనీ అడోబ్‌కు 2007 నుంచి శాంతనూ నారాయణ్ సీఈవోగా కొనసాగుతున్నారు. 1998 నుంచి అడోబ్‌లో వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించిన ఆయన కంపెనీ వృద్ధిని పరుగులు పెట్టించారు. శాంతనూ.. హైదరాబాద్‌లోనే జన్మించారు.

 

అరవింద్ కృష్ణ, ఐబీఎం (Arvind Krishna, IBM)

ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చేసిన అరవింద్ కృష్ణ.. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎంకు సీఈవోగా ఉన్నారు. ఐబీఎంలో ఆయన 30 సంవత్సరాలుగా వివిధ స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

స్టీవ్ సంఘీ, మైక్రోచిప్ (Steve Sanghi, Microchip)

మైక్రో కంట్రోలర్స్‌, ఫ్లాష్ ఐపీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌ను ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ మైక్రో చిప్‌కు స్టీవ్ సంఘీ.. 1991 నుంచి 2021 మార్చి వరకు సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో ఉన్నారు. పంజాబ్ యూనివర్సిటీలో ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

 

​నికేశ్ అరోరా, పాలో అల్టో నెట్‌వర్క్స్ (Nikesh Arora, Palo Alto Networks)

పాలో అల్టో నెట్‌వర్క్స్ సంస్థకు నికేశ్ అరోరా 2018 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఈయన బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.

 

అంజలి సూద్, వీమియో (Anjali Sud, Vimeo)

ఓపెన్ వీడియో ప్లాట్‌ఫామ్‌ వీమియోకు అంజలి సూద్ 2017 నుంచి సీఈవోగా ఉన్నారు. అమెజాన్‌లో గతంలో టాప్ పొజిషన్‌లో ఆమె పని చేశారు.

 

సంజయ్ మెహ్రోత్ర, మైక్రోన్ టెక్నాలజీ (Sanjay Mehrotra, Micron Technology)

సెమీ కండక్టర్ సొల్యూషన్స్ కంపెనీ మైక్రో టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్ర సీఈవోగా ఉన్నారు.

​రేవతి అద్వైతి, ఫ్లెక్స్ (Revathi Advaithi, Flex)

అమెరికన్ సింగపూరియన్ డొమిక్లయిడ్ మల్టీనేషనల ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్లెక్స్ లిమిటెడ్‌కు సీఈవోగా రేవతి అద్వైతి ఉన్నారు. 2019 నుంచి ఆమె ఆ స్థానంలో కొనసాగుతున్నారు.